హైదరాబాద్, నవంబర్ 15: ఖైది నెం 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి మల్లీ తన జోరు పెంచాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత కొరటాల శివతో సినిమా కూడా లైన్ లో పెట్టాడు. వరుసగా మూడవ సినిమా కూడా వొకే ప్రొడక్షన్ లో చేస్తున్నాడు చిరంజీవి. అది కూడా తన సొంత బ్యానర్ అవడం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి అందులో మొదటిగా ఖైది నంబర్ 150 నిర్మించారు.
సెట్స్ మీద ఉన్న సైరా సినిమా కూడా కొణిదెల బ్యానర్ లోనే వస్తుందట. ఇక కొరటాల శివ కూడా రాం చరణ్ నిర్మాతగా ఉంటున్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి సినిమా ఉంటుందని భావించినా ఇప్పుడప్పుడే ఆ ఛాన్స్ లేదని తెలుస్తుంది. కనీసం అల్లు అరవింద్ కు కూడా చిరంజీవి దొరకని విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. ఎంతైనా సొంత బ్యానర్ సొంతదే కదా. మరి గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. బోయపాటి శ్రీనుతో అరవింద్ చిరుతో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.