బిజేపి మూడో జాబితా ప్రకటన

SMTV Desk 2018-11-14 12:44:35  BJP, Telangana elections, Election candidates

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు బిజెపి ఇప్పటికే రెండు జాబితాలలో మొత్తం 66 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. కాగా ఈ రోజు మూడో జాబితావిడుదల చేయబోతున్నట్టు తెలిపింది. ఇవాళ్ళ ఉదయం డిల్లీలో జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మూడవ జాబితాలోని అభ్యర్ధులపై చర్చించి తుదినిర్ణయం తీసుకొంటారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడానికి నేడు డిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు సాయంత్రంలోగా మూడవ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.