బిజేపి అభ్యర్దులపై ఘాటుగా స్పందించిన ఒవైసీ

SMTV Desk 2018-11-12 19:07:17  Asaduddin owasis, BJP Leaders, Telangana elections

హైదరాబాద్, నవంబర్ 12: నగర ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ వొవైసీ బీజేపీ అభ్యర్థులు చేసిన హామీలపై స్పందించారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే లక్ష ఆవులను పంపిణీ చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.

అయితే దీనికి వొవైసీ స్పందిస్తూ ‘బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష ఆవులను పంపిణీ చేస్తామని ప్రకటించింది. నాకు కూడా వొక గోవును ఇస్తారా? ఆ గోవును అత్యంత పవిత్రంగా పెంచుకుంటాను. నాకు ఇస్తారా? లేదా? ఇదే నా ప్రశ్న. ఇది నవ్వుకునే అంశం కాదు. నేను సీరియస్‌గా అడుగుతున్నాను. వొకసారి ఆలోచించండి అని అన్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అసదుద్దీన్ పేర్కొన్నారు.