జనవరిలో అయోధ్య వివాదంపై పునః విచారణ

SMTV Desk 2018-11-12 19:02:09  Ayodhya temple, Supreem court, BJP

ఉత్తర ప్రదేశ్, నవంబర్ 12: అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు మరో నిర్ణయం తీసుకుంది. అయోధ్య భూవివాదంపై ముందస్తు విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అయోధ్యపై హిందూ మహాసభ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పుడే విచారించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం తేల్చిచెప్పింది. అయోధ్య వివాదంపై ఇదివరకే సుప్రీం పలు మార్గదర్శలను విడుదల చేసిందని, దాని ప్రకారమే వచ్చే ఏడాది జనవరిలో ప్రత్యేక ధర్మాసనం ద్వారా విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండే సుప్రీం తీర్పుతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2010లో అలహాబాద్‌ హైకోర్టు అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా విభజించింది. దీనిపై సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 14 పిటిషన్లు దాఖలైనట్లు కోర్టు తెలిపింది.

వీటన్నింటినీ కలిపి వొకేసారి జనవరిలో విచారిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. కాగా యూపీలో బీజేపీ ప్రభుత్వం కోర్టు తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా పార్లమెంట్‌ ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మీద వొత్తిడి తీసుకొస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే శీతాకాల సమావేశంలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.