అమరావతి, నవంబర్ 9: ఉదయం 11: 45 నిమిషాలకు ఉండవల్లి ప్రజవేదికగా కేబినేట్ విస్తరణ జరుగబోతుంది అని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఖాళీగా వున్నా రెండు మంత్రుల పదవులను భర్తీ చేస్తామని బాబు చెప్పుకొచ్చారు. అందులో వొకటి మైనారిటీ కి మరొకటి ఎస్టి కి ఇచ్చే అవకాశం కనిపిస్తుందని పలు వర్గాలు చెప్పుకుంటున్నారు.
అయితే ఫరూఖ్, కిదారి సర్వేశ్వర రావు తనయులకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా శాఖల మరులు చేర్పులకి కూడా అవకాశం వుంది అని సమాచారం. ఫరూఖ్ కి మైనారిటీ శాఖని ఖాయం చేస్తామంటున్నారు.
ప్రస్తుతం ఖాళీగా వైద్య ఆరోగ్య శాఖ వుంది. దీన్ని ఓ సినియర్ మంత్రికి ఇచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి.