న్యూఢిల్లీ, జూలై 21: దక్షిణాది రాష్ట్రాల్లో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు టాటా స్కై, డిటిహెచ్ సర్వీసు బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ నయనతారను నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వారి బ్రాండ్ వాణిజ్య ప్రకటనలను మరింత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు ఉద్దేశించినట్లు తెలిపారు. నాలుగు (తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ) భాషలలో నటించిన నూతన వాణిజ్య ప్రకటనను ఈ సందర్భంగా విడుదల చేసారు. టాటా స్కై ప్రకటనకు నయనతార అంగీకరించడం చాల సంతోషంగా ఉందని టాటా స్కై, చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ మాలే దీక్షిత్ అన్నారు. టాటా స్కై ప్రకటనలో నటించడం నాకు చాల సంతోషంగా ఉందని నయనతార అన్నారు. ప్రస్తుతం టాటా స్కై కి దేశవ్యాప్తంగా 17 మిలియన్ల కనెక్షన్లున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ప్రచారంలో భాగంగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా టాటా స్కై ప్రకటనలో నటించారు.