జగన్ పై దాడి కేసు రోజురోజుకి కొత్త మలుపు

SMTV Desk 2018-10-31 18:25:06  Jagan mohan reddy, Attemt to murder, Srinivas rao, Police Enquiry

విశాఖపట్నం, అక్టోబర్ 31: విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిలో కీలక నిందితుడైన శ్రీనివాసరావును పోలీసులు విచారిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతన్న నేపథ్యంలో రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వచ్చిన సిట్ బృందం వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది.

అయితే శ్రీనివాసరావు ప్లాట్‌లోని మరో రూంలో ఉన్న అమ్మాయిలు వీరేనా? అనే విషయం ఇంకా తెలియలేదు. వీరిలో వొకరు శ్రీనివాసరావు తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన సమయంలో వచ్చిన యువతి అను అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఆ అమ్మాయితో చాలా సార్లు ఫోన్లు కూడా మాట్లాడినట్లు సమాచారం. అలాగే మధ్యప్రదేశ్‌లోని శ్రీనివాసరావు స్నేహితుడిని సిట్ విశాఖకు రప్పించి, విచారిస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యం భాగానే ఉందని, నేడు నాలుగో రోజు కస్టడీలో భాగంగా విచారిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.