భారీ బందోబస్తు నడుమ చార్మి

SMTV Desk 2017-07-21 13:32:00  charmi, sit, drugs case, charmi drugs case,

హైదరాబాద్, జూలై 21: ఈ నెలలో 26 న నాంపల్లిలోని ఎక్సైజ్ అధికారులు చార్మిని విచారించనున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ కేసులో ఆమెకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలు వచ్చిన నేపథ్యంలో, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ లోని ఐదవ అంతస్తులో ఏర్పాటు చేసిన సిటి కార్యాలయంలో ఆమెను విచారించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. చార్మి కూడా ఇక్కడ విచారణకు వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. నిజానికి చార్మి శనివారం విచారణకు రావలసి ఉండగా, అధికారులు చార్మి స్థానంలో హీరో తరుణ్ ను విచారిస్తునట్లు తెలిపారు. చార్మిని జూలై 26న విచారించనున్నట్లు ప్రకటించారు. ఛార్మి విచారణ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు పోలీసులను కోరినట్లు వెల్లడించారు.