‘ధర్మ పోరాట’ దీక్షకు అన్నీ సిద్ధం

SMTV Desk 2018-10-30 12:25:41  Jagan mohan reddy, Chandrababu naidu, Lokesh, Devineni, Somireddy, Aadinarayan reddy, TDP

కడప, అక్టోబర్ 30: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కంచుకోటలాంటి కడప జిల్లాలో తెదేపా ‘ధర్మ పోరాట’ దీక్షను మంగళవారం చేపట్టనుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. విభజన హామీలను అమలు కోసం తెదేపా చేపట్టిన ఈ దీక్షకు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, దేవినేని, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి పాల్గొంటున్నారని సమాచారం.

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి అనంతరం జిల్లాలో చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై విధాన ప్రకటన చేస్తారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.