పుదుచ్చేరి, అక్టోబర్ 30: కడలూరు జిల్లాకు చెందిన భరత్ (26) హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అతనికి ఏమైందో ఏమో కాని వున్నట్టుండి హిజ్రాగా అవతారం ఎత్తాడు. దారి దోపిడీలు చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. తనకు తోడుగా సురేష్ (20)ను వుంచుకున్నాడు. ఇద్దరూ కలిసి దారి కాయడం, వచ్చీ పోయే అబ్బాయిలను పట్టుకుని కత్తులతో బెదిరించి అందినకాడికి దోచుకుని పబ్బం గడుపుతున్నారు.
ఈ క్రమంలో రాజమోహన్ అనే వ్యక్తిని ఈ నెల 25వ తేదీ నోనాంకుప్పం పళైయపాలం వద్ద వెళుతుండగా భరత్, సురేష్లు అడ్డుకున్నారు. కత్తితో బెదిరించి ఫోన్ను దోపిడీ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తమ నేరాలను అంగీకరించారు నిందితులు. హిజ్రాగా మారి వాహనాలను ఆపి దోపిడీలకు పాల్పడినట్లు అంగీకరించారు. యువకులపై దాడులు సైతం చేసి దోచుకున్నట్లు భరత్ తెలిపాడు. గత రెండేళ్లుగా ఇదే తరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారులు, భరత్ను హోంగార్డు విధుల నుంచి తొలగించారు.