భారీ లక్ష్యంతో విండీస్ బరిలోకి

SMTV Desk 2018-10-29 18:42:24  odi, west indies, india, mumbai

ముంబై, అక్టోబర్ 29: భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో నాల్గో వన్డే నేడు ముంబయి వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెటిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోర్ చేసింది. బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, అంబటి రాయుడులు సెంచరీలు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. జట్టు స్కోర్ 71 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్(38) అవుట్ అయ్యాడు.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అంబటి రాయుడు కూడా క్రీజ్ లోకి వచ్చినప్పటినుండి పరుగులు సాధిస్తూ రోహిత్ కి చక్కటి సహకారం అందించాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 102 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో సెంచరీ చేసాడు. అనంతరం సొంత ప్రేక్షకుల మధ్య చెలరేగి ఆడుతూ 150 పరుగుల మార్క్ ను కూడా చేరుకున్నాడు. అయితే అదే ఊపులో నర్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్, రాయుడు కలిసి 211 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పారు.

రోహిత్ అవుట్ అయిన అనంతరం రాయుడు బౌండరీలు బాదుతూ విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్ సహాయంతో 100 పరుగులు చేసాడు. వెంటనే భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. అనంతరం ధోనీ (23), జాదవ్ (16), జడేజా (7) పరుగులు చేసారు. విండీస్ బౌలర్ కీమర్ రోచ్ రెండు వికెట్లు తీసాడు.