ఒకప్పటి గొప్ప గాన రచయిత ఇప్పుడు దొంగగా మారాడు

SMTV Desk 2018-10-29 15:35:49  KULA SHEKHAR, MUSIC DIRECTOR,

హైదరాబాద్, అక్టోబర్ 29: పాటల రచయిత కులశేఖర్ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. అవకాశాలు లేక పోవడంతో ఖాళీగా ఉంటూ మానసికంగా బాధపడుతూ చివరకు దొంగగా కూడా మారాడు. తేజ డైరక్షన్ లో వచ్చిన నువ్వు నేను, జయం లాంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు అందించిన గొప్ప రచయిత. ఇంతకు ముందు 2013లో కాకినాడలో బాలాత్రిపుర సుందరి ఆలయంలో శఠగోపం దొంగతనం చేశాడని ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా హైదరాబాద్ లోని వో గుడిలో చోరీ చేసిన కేసులో కులశేఖర్ ను అరెస్ట్ చేశారు. అక్కడ పూజారుల బ్యాగులు, సెల్ ఫోన్స్ కొట్టివేయగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని చంచల్ గూడ జైలుకి పంపించడం జరిగింది.

పాటల రచయితగా 100కు పైగా పాటలు రాసిన కులశేఖర్ ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఇంట్లో నుండి బయటకు పంపించారని తెలుస్తుంది. ప్రస్తుతం కులశేఖర్ మానసిక పరిస్థితి బాగాలేదని అంటున్నారు. ఇక ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.