మాదకద్రవ్యాల కేసు రెండో రోజు విచారణ

SMTV Desk 2017-07-20 20:04:07  drags, camera men shayam k sundar

హైదరాబాద్, జూలై 20: మాదక ద్రవ్యాల కేసులో రెండో రోజు జరిగిన విచారణ ముగిసింది. కెమెరా మాన్ శ్యామ్ కె నాయుడును సిట్ కార్యాలయంలో అధికారులు విచారించారు. తొలి రోజు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ను దాదాపు పది గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. కానీ శ్యామ్ నాయుడును మాత్రం ఆరు గంటల పాటే విచారించారు. తన న్యాయవాది, కొద్దిమంది సన్నిహితులతో కలిసి నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి నాయుడు వచ్చారు. డ్రగ్స్ ముఠా నేత కెల్విన్ తో ఉన్న సంబంధాలపైనే అధికారులు ఆరా తీశారని చెబుతున్నారు. కెల్విన్‌తో ఇతరులకు ఉన్న సంబంధాలపై ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.