"మన బలం జనం చూపిద్దాం ప్రభంజనం" - పవన్

SMTV Desk 2018-10-29 12:12:22  janasena, pawan kalyan, twitter

అమరావతి, అక్టోబర్ 29; జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో జనసేన ఏ పార్టీ తో పోట్టుపెట్టుకుంది అని వస్తున్న వార్తలపై స్పందించారు. రాబోయే ఎన్నికల్లో తాము వొంటరి పోరుకే సై అంటున్నామని తేల్చి చెప్పేసారు. జనసేన పార్టీకి ఎవరి అండ దండలు అవసరం లేదని పవన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.



‘ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. జనసేన ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుంది.. అని కొందరు అంటున్నారు. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మనకు ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు. మన బలం జనం. చూపిద్దాం ప్రభంజనం’ అని పవన్ ట్వీట్ చేశారు.