భారత్ - పాకిస్థాన్ హాకీ టైటిల్ పోరుకు సిద్ధం

SMTV Desk 2018-10-28 14:25:55  asia champions trophy 2018, india, pakisthan

న్యూఢిల్లీ, అక్టోబర్ 28; భారత్ - పాకిస్థాన్ తో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో టైటిల్ పోరుకు సిధమవుతోంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్థాన్‌ 3-1తో మలేసియాపై గెలిచింది. అలాగే భారత్ 3-2తో జపాన్‌ను వోడించింది . జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభం నుండి చివరి వరకు ఆధిపత్యం చెలాయించింది.

రెండో క్వార్టర్‌లో గుర్జంత్‌ (19వ నిమిషం) ఫీల్డ్‌ గోల్‌ చేయగా భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను చింగ్లెన్‌సెనా గోల్‌గా మలిచి జట్టును 2-1 ఆధిక్యంలో నిలిపాడు. ఆఖరి క్వార్టర్స్‌లో భారత్‌ మరింత దూకుడుగా ఆడటంతో3-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.