తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్దుల ప్రకటన

SMTV Desk 2018-10-27 15:40:50  congress, uttam kumar reddy, telangana elections

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థుల వివరాలు వెల్లడించకుండా పార్టీ ప్రచారాలు చేస్తూనే వున్నారు. అయితే తాజాగా తీపీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 1న‌ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అదేరోజు మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. ఒకటి రెండు రోజుల్లో మేనిఫెస్టోకు తుది రూపు వస్తుందన్నారు. అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే ఆలస్యమైందని, నవంబర్ 1వతేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.