అమరావతి, అక్టోబర్ 27: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కత్తి దాడిపై అధికార పార్టీ మంత్రి నారా లోకేష్ చాలా ఘాటుగా స్పందించారు. అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఏ1 ముద్దాయి జగన్ మోడీ రెడ్డి దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్ లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు. అంటూ అలాగే
కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థల పై నమ్మకం లేదు అంటూ రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా జగన్ మోడీ రెడ్డి మాట్లాడటం దారుణం. అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థల పై నమ్మకం లేదు అంటూ రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా జగన్ మోడీ రెడ్డి మాట్లాడటం దారుణం. #Jagannatakam
— Lokesh Nara (@naralokesh) October 27, 2018