అగ్రిగోల్ద్ ఆస్తులపై హై కోర్టు మల్లీ విచారణ

SMTV Desk 2018-10-26 18:51:27  hgh court, agrigold, assets, cbi

హైదరాబాద్, అక్టోబర్ 26: హై కోర్టు అగ్రిగోల్ద్ కేసును మల్లీ విచారణ జరిపింది. అయితే హాయ్‌ల్యాండ్‌ విలువ రూ.550 కోట్లుగా కోర్టు నిర్ణయించింది. 2022 వరకు గడువు ఇస్తే రూ.8500కోట్లు చెల్లించేందుకు సిద్ధమని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. కాగా అగ్రిగోల్డ్‌ యాజమాన్య ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది.

విజయవాడలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్ భవనాన్ని విక్రయించగా వచ్చిన రూ.11 కోట్ల రూపాయలను కొనుగోలుదారులు కోర్టులో డిపాజిట్ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏపీ సీఐడీ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించింది. అలాగే తెలంగాణలో ఉన్న 195 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తెలంగాణ సీఐడీ కోర్టుకు అందజేసింది. తదుపరి విచారణ నవంబర్ 9కి కోర్టు వాయిదా వేసింది.