హైదరాబాద్, అక్టోబర్ 26: నగరంలోని అబిడ్స్లోని అల్సెన్స్ హైస్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ రూమ్లో వొక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ అలుముకొంది. పొగ కారణంగా ఏడుగురు విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో 2 వేల మంది విద్యార్థులు ఉన్నారు.