హైదరాబాద్, అక్టోబర్ 26: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు అనిల్ కుమార్, అమరనాథ్ రెడ్డి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీఎస్ఎఫ్ అధికారుల రిపోర్టు తీసుకోవాలని దాడి ఘటన మొత్తం సీబీఐ చేత విచారణ చేయించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కాగా ఈ దాడి ఘటనపై లంచ్మోషన్లో హైకోర్టు విచారించనుంది.