న్యూఢిల్లీ, జూలై 20 : ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఫోన్ ఇన్స్టాలేషన్ చార్జీలను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది. ల్యాండ్ లైన్ ఫోన్లను, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ను ఉచితంగా అమరుస్తామని (ఇన్స్టాలేషన్) బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. కొత్తగా ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇస్తే రూ.600, బ్రాడ్ బ్యాండ్ కైతే రూ.850 చొప్పున రుసుం వసూలుచేస్తోంది. కాగా నిన్నటి నుండే రుసుము రద్దు వర్తిస్తుందని, తదుపరి ప్రకటన చేసే వరకు అమల్లో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అంతే కాకుండా నెలవారీ ధర రూ.675, అంతకు మించిన మొత్తం ప్లాన్ కనుక తీసుకుంటే, వారికి వైఫై బ్రాడ్ బ్యాండ్ మోడెమ్ కొనుగోలులో 100 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది.