వాహనాల తనిఖీలో రూ.10 లక్షలు స్వాదినం.

SMTV Desk 2018-10-25 16:07:22  VEHCILE CHECKINGS, ILLEGAL CURRENCY, POLICE, TRANSPORT

మేడ్చల్, అక్టోబర్ 25: వాహనాల తనిఖీలో రూ. పది లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట కమాన్ వద్ద చోటుచేసుకుంది. మౌలాలి నుండి అంకిరెడ్డిపల్లికి వెళ్తున్న వొక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో రూ.10 లక్షలు బయటపడ్డాయి. డబ్బును తరలిస్తున్న వ్యక్తిని కొండవీటి రాయన్నగా గుర్తించారు. నగదు తరలించిన వాహనం నెంబర్ టీఎస్ 08 ఈసీ 9689.