కొత్త రికార్డు క్రియేట్ చేసిన విండీస్ ఆటగాడు.

SMTV Desk 2018-10-25 15:38:30  WEST INDIES, NEW RECORD, SHAY HOPE,ODI

విశాఖపట్నం, అక్టోబర్ 25: భారత్-విండీస్ తో నిన్న జరిగిన రెండో వన్డే విశాఖ లో జరిగి మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో.. టైగా ముగిసిన రెండు మ్యాచ్‌ల్లో శతకం బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్‌ కావడం విశేషం.

శ్రీలంక, జింజాబ్వే, విండీస్ మధ్య ట్రై సిరీస్‌లో భాగంగా.. 2016లో బులవాయె వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో హోప్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ కూడా టైగా ముగిసింది. చివరి వరకూ పోరాడినప్పటికీ వైజాగ్ వన్డే టైగా ముగియడంతో హోప్ నిరుత్సాహానికి గురయ్యాడు. మేం గెలవలేదు కాబట్టి.. ఈ సెంచరీకి అంత ప్రాధాన్యం లేదని హోప్ మ్యాచ్‌ అనంతరం తెలిపాడు.