హైదరాబాద్, జూలై 20: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులకు రక్షణ పూర్తిగా కరువై పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. ఇటీవల తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఇసుక లారీని తగులబెట్టారు. అయితే పోలీసులు ప్రమాదానికి కారణమైన నిందితులను వదిలేసి అన్యాయంగా లారీలను తగులబెట్టిన దళితులను అదుపులోకి తీసుకొని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగిందన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.