విశాఖపట్నం, అక్టోబర్ 25: తాజాగా జగన్ పై జరిగిన దాడి గురించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను గవర్నర్ నరసింహన్ డీజీపీని అడిగి తెలుసుకున్నారు.