హైదరాబాద్, అక్టోబర్ 25: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తోన్న నవయుగ కన్ స్ట్రక్సన్ పై ఐటీ సోదాలు నిర్వహించింది. నగరంలోని నవయుగ కార్యాలయంలో ఉదయం 8గంటల నుంచే తనిఖీలు ప్రారంభించి ఇపటికి కొనసాగుతున్నాయి. నవయుగకు చెందిన 47 కంపెనీలపై ఐటీ ఆరా తీస్తోంది.
గత నాలుగేళ్లుగా ఐటీ రిటర్న్స్, ప్రాజెక్టుల నిర్వహణపై ఐటీ విచారిస్తోంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలు ఉల్లంఘించారని నవయుగపై ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి.