విశాఖపట్నం, అక్టోబర్ 25: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొంత సమయం క్రితం విశాఖపట్నం ఎయిర్పోర్టు లాంజ్లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తన ఎడమ చేతికి గాయమైంది. సెల్ఫీ తీసుకుంటానని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఊహించని విధంగా కత్తితో దాడికి దిగాడు. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్లోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు.
దాడి జరిగిన వెంటనే అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయం వచ్చిన జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. 294వ రోజు పాదయాత్ర ముగించుకుని గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చారు.