వైజాగ్ లో భారత్-విండీస్ తో జరుగుతున్న రెండో వన్డే లో ఇప్పటికే కోహ్లి ఒక రికార్డును సమం చేసుకున్నాడు. సెంచరీ కూడా పూర్తి అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ను గెలిచి సిరీస్ లో ఆధిక్యం సంపాదించాలని టీమిండియా, ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని కరీబియన్లు భావిస్తున్నారు.భారత జట్టులో పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు స్థానం కల్పించారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించేలా ఉందని, తమ బౌలింగ్ టార్గెట్ను డిఫెండ్ చేయగలిగేలా ఉందని కోహ్లి అన్నాడు. ఇప్పుడు టీం ఇండియా బాదుడు చూస్తుంటే కరీబియన్లు భావించేది ఒక కలలాగే ఉండేలా వుంది.