హైదరాబాద్ , అక్టోబర్ 24; ‘ఆఫీసర్’ సినిమాతో ప్రేక్షకుల్ని చివరిగా పలకరించిన వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ చేసిన చిత్రం ‘భైరవ గీత’. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేశాడు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఇది వరకే విడుదలకావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వలన అది కాస్త వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా వర్మ ఈ సినిమాను నవంబర్ 22న విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు.