విజయ్ శేకర్ శర్మ పేటీఎం వ్యవస్థాపకుడు అతన్ని తన సొంత ఉద్యోగులే బ్లాక్మెయిల్ చేసి రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇవ్వకపోతే అతని వ్యక్తిగత డేటా, రహస్య సమచారాన్ని లీక్ చేస్తామని బెదరించారు. సొంత ఉద్యోగులే రూ.20 కోట్లు ఇవ్వకపోతే డేటా లీక్ చేస్తామని బెదిరిస్తున్నారని శేఖర్ శర్మ సెక్టార్ 20 పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వో మహిళ సహా ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరొకర్ని అరెస్ట్ చేయాల్సి ఉంది.