రాజకీయ అరంగేట్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

SMTV Desk 2018-10-23 19:31:53  cbi joint director, jd laxminarayana

హైదరాబాద్ అక్టోబర్23: తెలుగు ప్రజలందరికి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సుపరిచితమైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.తానూ ఏ పార్టీ లో చేరలనేది ఇంకా నిర్ణయించుకోలేదని అని తెలిపారు.అయితే వో కార్యక్రమంలో మీడియా తో మాట్లాడుతూ కొత్త పార్టీ స్థాపించాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే విషయంపై ఆలోచిస్తున్నానని తెలిపారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పటికయితే తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించాయని లక్ష్మీనారాయణ తనకు వచ్చిన ఆఫర్లను వెల్లడించారు. ఆ ఆపర్లపై తటస్థంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి తాను ఏపీకే పరిమితం అవుతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున తగిన వ్యూహంతో ముందుకెళ్తానని చెప్పారు. కాగా ఆయన్ని అభిమానించే యువత అతను ఏ పార్టీ లో చేరకుండా కొత్త పార్టీ పెడితే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు. ఆయన రాజకీయ అరంగేట్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.