ఓటు హక్కు వినియోగంపై అవగాహన

SMTV Desk 2018-10-23 18:15:56  state govt,central govt,voting,handicaped

హైదరాబాద్ అక్టోబర్23:తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వోటు హక్కు వినియోగం పై అన్ని వర్గాల వారికీ అవగాహనా కల్పించింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణా లో అంధులకు , దివ్యాంగులకు కేంద్ర,రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వోటు వినియోగంపై అవగాహన కల్పించారు. వారికి ప్రత్యేకంగా వోటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, ర్యాంపులు, బ్రెయిలీ లిపి ద్వారా ఎలా వోటింగ్‌ వినియోగించుకోవాలో వివరించారు.
ఈ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించే పలు వాహనాలను అధికారులు ప్రారంభించారు. రెండో రోజు సమావేశానికి డీజీపీ మహేందర్‌ రెడ్డి, అడిషనల్‌ డీజీ జితేందర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు.