ముంబై అక్టోబర్23 :భారత 'ఎ'జట్టు ఆస్ట్రేలియా 'ఎ' జట్టు పై విజయ భేరి మ్రోగించింది.
నిన్నముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వేదికగా మహిళల టీ 20 సిరీస్ ని ఆరంభించగా భారత్ 'ఎ' జట్టు ఆస్ట్రేలియా 'ఎ 'జట్టు పై 4 వికెట్ల తేడాతో చాలా అవాలీలగా విజయం సాదించింది.తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 'ఎ' 160/6 పరుగులు చేసింది. హీథర్ గ్రాహమ్ (43) టాప్ స్కోరర్గా నిలిచింది. అనుజా పాటిల్, దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో స్మృతి మంధాన 40 బంతుల్లో 72 పరుగుల మెరుపు ఇన్నింగ్స్కు తోడు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (45) కదం తొక్కటంతో భారత్ 'ఎ' 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని (163/6) ఛేదించింది. యువ ఓపెనర్ జెమీమా రొడ్రిగస్ (4), తానియా భాటియా (0) విఫలమయ్యారు. టీ20 ప్రపంచకప్కు ముందు అమ్మాయిలకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవటంతో ఆసీస్ 'ఎ' జట్టుతో సిరీస్కు సీనియర్ జట్టును ప్రకటించింది బీసీసీఐ.తరువాత వెస్టిండీస్తో సిరీస్ అనుకున్నా, అనుకోని పరిస్థితుల్లో అది వాస్తవ రూపం దాల్చలేదు. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ప్రపంచకప్ జట్టునే 'ఎ' జట్టు సిరీస్కు ప్రకటించారు.కాగా సిరీస్ లోని రెండో టీ 20 బుదవారం జరుగనుంది.