ఆర్టీసీ బస్సు ఢీకొన్ని మహిళ మృతి

SMTV Desk 2018-10-23 15:28:58  rtc,

యదాద్రి భువనగిరి అక్టోబర్23 :యాదగిరి గుట్ట సపీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న వొక మహిళని వేగంగా వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టింది.ఈ ఘటన సురేంద్రపురి వద్ద జరుగగా, ప్రమాదం జరిగిన అనంతరం ఆ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది.మృతురాలిని సంగీత (60) ,గత 10 నెలల నుంచి సురేంద్రపురి లోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో వంటమనిషిగా పని చేస్తున్నారు.మహిళను ఢీకొట్టిన బస్సు పికెట్ డిపోకు చెందింది. ఆర్టీసీ బస్సు నెంబర్ టీఎస్ 07 యూఈ 5951.