ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమే మా లక్ష్యం :చిదంబరం

SMTV Desk 2018-10-23 14:39:55  chidambaram,former fm,congress,bjp

న్యూఢిల్లీ అక్టోబర్23 :కాంగ్రెస్,ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత,కేంద్ర ఆర్దికశాఖ మాజీమంత్రి చిదంబరం అన్నారు.అలాగే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ముఖ్య అభ్యర్ది ఎవరనేది చెప్పకుండానే బరిలోకి దిగుతుందని అన్నారు.సోమవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కానీ, మరే ఇతర నేతలను కానీ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనే దానిపై ఆలోచిస్తామన్నారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ సమావేశమై ప్రధాని ఎన్నికపై తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మోడీ సర్కారుకు చెక్‌ పెట్టేందుకు బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.కాగా బీజేపి బెదిరింపులకు ప్రాంతీయ పార్టీ లు కాంగ్రెస్ తో పొత్తు కాకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ,అలాగే దేశంలోని ప్రాంత్రీయ పార్టీలు కొంతకాలంగా పుంజు కుంటున్నాయని తెలిపారు.