హైదరాబాద్, అక్టోబర్ 23; జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ సాయంత్రం 4 గంటల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. 4గంటలకు గవర్నర్ నరసింహన్ పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. తిత్లీ తుఫాన్ బీభత్సం, బాధితుల కష్టాలను పవన్ కల్యాణ్ గవర్నర్ కు వివరించనున్నారు. వీలైనంత త్వరగా సాయం అందించాలని జనసేనాని కోరనున్నారు.