హైదరాబాద్, అక్టోబర్ 23: హైదరబాద్ లో పోలిస్ తనిఖీల్లో పలుచోట్ల కట్టలు కట్టలు గా కరెన్సీ బయటపడింది.సోమవారం నగరం లోని మూడు ప్రాంతాల్లో మొత్తం 74.85 లక్షల నగదు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.షాహినాయత్ గంజ్ పోలిస్ స్టేషన్ పరిధిలో పవన్ వ్యాస్ అనే వ్యక్తి దగ్గర 60 లక్షలు,బ్రిజిష్ తివారి నుండి రూ.10 లక్షలు,జుబ్లిహిల్ల్స్ లోని రామచంద్రరావు అనే వ్యక్తి నుండి రూ.4.85 లక్షలు తరలిస్తుండగా స్వాదినం చేసుకున్నాం అని డిసీపి ఎ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు.మూడు రోజుల నుండి నిర్వహించిన ఈ తనిఖీల్లొ మొత్తం 3.88 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.