న్యూఢిల్లీ, ;డొమినికన్ రిపబ్లిక్ లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ పేస్ -వారెలా జంట 4-6,6-3,10-5,తో బెహర్(ఉరుగ్వే)-రొబెర్టో(ఈక్వెడార్)జంట పై విజ్రుంబించి టైటిల్ ను సాదించారు.లియాండర్ పేస్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం.ఈ జంట సొంతం చేసుకున్న టైటిల్ తో 110 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ.5.70 లక్షల ప్రైజ్ మనీ పేస్ ఖాతాలో చేరింది.గతవారం జరిగిన మాంట్రి ఛాలెంజర్ టోర్నీ లో పేస్ రన్నరప్ గా నిలిచాడు.