హైదరాబాద్;ఆదివారం ముగిసిన భారత-విండీస్ టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-౦ తేడాలో విండీస్ ను వోడించిన విషయం తెలిసిందే.మ్యాచ్ అనంతరం టీం ఇండియా సారధి విరాట్ కోహ్లి మాట్లాడుతూ ....భారత బౌలర్ల గురించి పొగుడుతూ ,ఈ మధ్య కాలంలో తమకు బౌలింగ్ వొక సమస్య కాదని బౌలర్లు తమ విధిని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు అని చెప్పుకోచారు.కానీ బ్యాటింగ్ విషయానికొస్తే,తమ జట్టు బ్యాటింగ్ నిలకడగా లేదు అని ప్రధానంగా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు తమ బ్యాటింగ్ విఫలం అవ్వడం వల్ల సిరీస్ లు కోల్పోతున్నాము అని వెల్లడించారు. మేము విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బ్యాటింగ్ అనేది సమస్యగా మారింది. ముఖ్యంగా మా బ్యాటింగ్లో నిలకడ ఉండటం లేదు. దాంతోనే విదేశీ సిరీస్లను సాధించడంలో వైఫల్యం చెందుతున్నాం. విదేశీ సిరీస్లను గెలవాలంటే బ్యాటింగ్ అనేది మెరుగుపడాలి. అప్పుడే అక్కడ్నుంచి సగర్వంగా స్వదేశానికి రాగలం. అంటూ బ్యాటింగ్ స్వదేశం లో బాగానే ఆడుతున్నాం ఈ విధంగానే విదేశాల్లో కూడా ప్రదర్శించాలి అని కోహ్లి మాట్లాడాడు.