పాస్‌పోర్టు పోగొట్టుకున్న బ్యాడ్మింటన్ ఆటగాడు

SMTV Desk 2018-10-13 18:57:58  parupallikashyap,saina nehwal,narendramodi,shushmaswaraaj

ఇంటర్నెట్ డెస్క్;ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తన పాస్ పోర్ట్ పోగుట్టుక్లున్నారని ట్విట్టర్ ద్వారా వెల్లండించారు.‘ఆమ్‌స్టర్‌డామ్‌లో గత రాత్రి నా పాస్‌పోర్టు పోయింది. నేను డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, జర్మనీలో జరిగే సార్లాక్స్‌ ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. డెన్మార్క్‌కు వెళ్లేందుకు ఈ ఆదివారానికి టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాను. ఈ విషయంలో నాకు సాయం చేయండి’ అంటూ ప్రముఖులైన సుష్మాస్వరాజ్‌ సహా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాఠోడ్‌‌కు ట్యాగ్ చేస్తూ కశ్యప్‌ ట్వీట్‌ చేశారు.
అలాగే ఇదే ట్వీట్ ను తనకు కాబోయే సతీమని, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా రిట్వీట్ చేశారు.దీనిపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించాల్సి ఉంది.