రెండో టెస్టు,రెండో రోజు ఆట...

SMTV Desk 2018-10-13 16:24:06  teamindia,westindies,testmatch

హైదరాబాద్;భారత్-విండిస్ తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది.విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని తొలిరోజు ఆట ముగిసే సమయానికి 295 పరుగులు చేసి 7 వికెట్ల నష్టం తో ముగిసింది. ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ (98 బ్యాటింగ్‌; 174 బంతుల్లో 7×4, 1×6), కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (52; 92 బంతుల్లో 6×4) ఈ విధంగా ఉండగా రెండో టెస్టును విండీస్ ప్రారంభించింది.పేసర్ ఉమేష్ యాదవ్ (3/83) , కుల్‌దీప్‌ యాదవ్‌ (3/174) తొలి రెండు సెషన్లలో విండీస్ ను దెబ్బ తీసారు.ఇద్దరూ కలిసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.విండీస్ చేతిలో ఇంకా మూడు వికెట్లే మిగిలి ఉన్నాయి. రోస్టన్‌ చేజ్‌, దేవేంద్ర బిషూ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.