దుబాయ్;కెరీర్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు 937 తో నంబర్ వన్ ర్యాంకుల్లో కొనసాగుతున్న విరాట్ కోహ్లి ఇప్పుడు టెస్టుల్లో తన అగ్రస్తానాన్ని మరింత జాగ్రత్త పరుచుకుంటున్నారు. ఇంగ్లాండ్తో సౌథాంప్టన్ టెస్టు తర్వాత విరాట్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాట్స్మన్గా నిలిచాడు.విండీస్ తో జరిగిన తొలి టెస్టులో 139 పరుగులతో చెలరేగిపోయిన విషయం అందరికి తెలిసిందే.అలాగే కుల్దీప్ యాదవ్ కూడా తన ర్యాంక్ ని అదే మ్యాచ్ లో వొకేసారి 16 స్థానాలు ఎగబాకి 57వ స్థానంలో మెరుగు పరుచుకున్నాడు.రవీంద్ర జడేజా కూడా బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో6 స్థానాలు ముందుకెళ్ళి 51 వ ర్యాంక్ లో ఉన్నాడు.షకిబ్ అల్ హసన్ కన్నా ఆల్రౌండర్ జాబితాలో మూడు పాయింట్ల తక్కువతో రెండో స్థానంలో నిలిచాడు.అరంగేట్రంలోనే అదరగొట్టి శతకం సాధించిన యువ పృథ్వీషా 73వ స్థానంతో ర్యాంకుల జాబితాలో ప్రవేశించాడు.ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసి 72 వ ర్యాంకుల్లో ఉన్నాడు.ఆస్ట్రేలియా వోపెనర్ ఉష్మాన్ ఖాన్ ఖవాజా పాక్ పై 85, 141 పరుగులు చేసి తొలి సారి టాప్ టెన్ లో స్థానం దక్కించుకొని పదో స్థానం లో ఉన్నాడు.