విండీస్ ఆశలు...నిరాశలే....!

SMTV Desk 2018-10-13 11:25:14  teamindia,westindies,bcci

హైదరాబాద్; భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 311 పరుగులకు ఆలౌట్ కాగా, విండీస్ 295/7 ఓవరనైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంబించినా ఫలితం లేకండా పోయింది.16 పరుగులను జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది.ఉమేష్ యాదవ్ బౌలింగ్ తో దాదాపు అందరిని చిత్తు చేసాడు. భారత్ కి ఎంతో గట్టి పోటీ ఇచ్చిన ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ (106;189 బంతుల్లో 8×4, 1×6) ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇంకా ఉమేష్ జాబితాలో గాబ్రియల్ (౦), పెవిలియన్,దేవేంద్ర బిషు(2) చేరారు.అలాగే రెండో రోజు ఆటలో మిగిలిన 3 వికెట్లు అతనికే దక్కడం విశేషం.భారత్ కి ఎంతో గట్టి పోటీ ఇద్దామన్న విండీస్ ఆశలని ఉమేష్ నిరాశలు చేసాడు.ఇది ఇలా ఉండగా భారత్ బౌలర్ల విషయానికొస్తే ఉమేష్ యాదవ్(6), కుల్‌దీప్‌ యాదవ్‌(3),అశ్విన్(1) వికెట్లు తీసారు.ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంబించగా కెఎల్ రాహుల్, పృథ్వీషా ఓపెనర్లుగా బరిలోకి దిగారు.