హైదరాబాద్: ఉప్పల్ వేదికగా వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విండీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్లలో రాస్టన్ చేస్(98 నాటౌట్), కెప్టెన్ హోల్డర్(52), హోప్(36), డౌరిచ్(30) రాణించారు. రాస్టన్ చేస్, కెప్టెన్ హోల్డర్ జోడి 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో కరేబియన్ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు, అశ్వీన్