14 నుంచి 21 కి సంస్మరణ సభ వాయిదా ...

SMTV Desk 2018-10-12 17:02:00  Pranay Murder, Amrut-Pranay's comprehensive committee of judiciary, Commemorative assembly

మిర్యాలగూడ ,అక్టోబర్ 12 :పెద్దలకు ఇష్టంలేకుండా ప్రేమ వివాహం చేసుకుని పరువు హత్యకు గురైన ప్రణయ్‌ కుటుంబానికి మద్దతుగా తరలిరావాలని న్యాయపోరాట సంఫీుభావ కమిటీ పిలుపునిచ్చింది. ఈనెల 14వ తేదీన నిర్వహించాలనుకున్న సంస్మరణ సభ అనివార్య కారణాల వల్ల 21వ తేదీకి వాయిదా పడిందని, మార్పును గమనించాలని కోరింది. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అమృత తండ్రి నియమించిన కిరాయి రౌడీల చేతిలో ప్రణయ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనను ఖండిస్తూ ఈనెల 14వ తేదీన ప్రణయ్‌ మద్దతుదారులతో సంస్మరణ సభ నిర్వహించాలని అమృత-ప్రణయ్‌ న్యాయపోరాట సంఫీుభావ కమిటీ నిర్ణయించింది. ఈ సభ 21న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతుందని, ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత పీడిత, బహుజన, కుల పోరాట, కుల నిర్మూలన సంఘాల ప్రతినిధులతోపాటు ప్రజాస్వామికవాదులు, మేధావులు హాజరవుతారని తెలిపారు.