కౌలాలంపూర్,అక్టోబర్ 12: మలేసియాలో కొన్ని నేరాలకు ఉరిశిక్ష తప్పనిసరి అనే నిబంధన ఉంది, కానీ కొన్ని దేశాలు మరణ శిక్షను రద్దు చేసిన సంఘటన తెలిసిన విషయమే ఆ దేశాల సరసన ఇప్పుడు మలేసియా కూడా చేరబోతోంది. దేశీయంగా ఉరి శిక్షపై వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా మలేసియా ప్రభుత్వ మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనికేషన్, మల్టీమీడియా మంత్రి గోబింద్ సింగ్ డియో తెలిపారు . త్వరలోనే దీనికి సంబంధించి చట్టం చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల ఉద్యమకారులు స్వాగతించారు. మరణ శిక్ష ఓ క్రూరమైన, అనాగరికమైన చర్య అని లాయర్స్ ఫర్ లిబర్టీ రైట్స్ గ్రూప్నకు సలహాదారు అయిన ఎన్ సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలో ఉరిశిక్ష రద్దైతే.. విదేశాల్లో మలేసియన్లకు మరణశిక్ష విధించే సందర్భాల్లో దాన్ని అడ్డుకునే నైతిక అధికారం ఉంటుందని ఆయన అన్నారు.
హత్య, కిడ్నాప్, ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాలు చెలామణీ చేయడం వంటి నేరాలకు పాల్పడ్డ సందర్భాల్లో మలేసియాలో మరణ శిక్ష విధిస్తారు.ఉరిశిక్ష వెయుటం రద్దు చేయటం వాళ్ళ ఇష్టమేనా ? చూదాం ఎమ్ జరుగుతుందో ...