అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్లోకి ఇటీవలె తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. కరణ్ జోహార్ నిర్మించిన `ధడక్` సినిమాతో జాన్వి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి నటిగా జాన్వి గుర్తింపు తెచ్చుకుంది అయితే త్వరలో జాన్వి.. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తెలుగులో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రంలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసులను దోచుకున్న జాన్విను తమ తదుపరి సినిమాల్లో కథానాయికగా ఎంపికచేసుకోవాలని దర్శకులు ఆశపడుతున్నారు. ఈ విషయం గురించి జాన్వి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది