భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య ?!

SMTV Desk 2017-07-19 13:49:27  Woman, hot oil, pune

ముంబై, జూలై 19 : జయ షెరియా (35) అనే యువతి పుణేలో నివాసం ఉంటుంది. ఆమె భర్త ముంబైలో ఉంటాడు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత వారం భార్య జయ పుట్టిన రోజు కావడంతో భరత్ ముంబై నుంచి వచ్చాడు. ఇద్దరూ ఆ రోజంతా కలిసి షాపింగ్ చేస్తూ సంతోషంగా ఉన్నారు. షాపింగ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్లిన తరువాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న జయ భరత్ పై మరుగుతున్న వేడి నూనెను పోసింది. ఈ ఘటన శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. భరత్, జయ 2011లో తొలిసారి పుణే-ముంబై రైలులో కలిశారు. అనంతరం ప్రేమలో పడి కొన్నాళ్లకు వివాహం చేసుకున్నారు. జయ పుణేలో ఉండి సెల్స్ ఉమెన్ గా పనిచేస్తుండగా, న్యాయ విద్యార్ధి అయిన భరత్ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రతి వారంలో ఒక్క రోజు ఇద్దరూ కలుసుకుంటారు. గత వారం కూడా కలుసుకున్నారు. అదే రోజు భార్య పుట్టిన రోజు కావడంతో ఆమె భర్తను తనకు కూడా ముంబై తీసుకెళ్లాలని జయ, భరత్ ను కోరడంతో ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. దీంతో గొడవ పడ్డ భరత్ తన బెడ్రూంలో వెళ్లి పడుకున్నాడు. అది ఆగ్రహించిన జయ కోపంతో వంటగదిలోకి వెళ్లి నూనెను మరగబెట్టి అతనిపై పోసింది. జయ కారణంగా భరత్ కు దాదాపు 10 శాతం ఒళ్లు కాలిపోవడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఛాతిపై, కడుపుపై, కాలిపై గాయాలయ్యాయి. ఈ మేరకు అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా, జయ తన తప్పు లేదని భరతే రెచ్చగొట్టాడని, డబ్బు కోసమే ఆమెను భరత్‌ వాడుకుంటున్నాడని, కేవలం జీతం కోసమే పుణేకు వస్తాడని ఆమె బంధువులు పోలీసులకు వెల్లడించారు.