ఆ చిత్రానికి రూ.5 కోట్ల సెట్..!

SMTV Desk 2017-07-19 10:10:23  sukumaar, raamcharan, samantha, movie, rangasthalam.

హైదరాబాద్, జూలై 19 : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 లో టైమ్ మెషీన్‌ గుర్తుంది కదా! ఆ మెషీన్ లోకి ఎక్కితే ఎంచక్కా మనకు నచ్చిన కాలంలోకి వెళ్ళవచ్చు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు సుకుమార్ చేయనున్నారు. అవసరమైతే ప్రేక్షకులను తమ కథల పరంగా ఇతర గ్రహాలకు తీసుకెళ్లి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని చూపిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "రంగస్థలం". రామ్ చరణ్, సమంత కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్ ను రూపొందించారు. 1985 రోజుల్లో, ఓ పల్లెటూరు ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి వాతావరణాన్ని కళా దర్శకుడు రామకృష్ణ రూపొందించాడట. ఈ సెట్‌ కోసం రూ.5 కోట్లు కేటాయించారు. ఈ నెల 24 నుంచి 35 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ సెట్ లోనే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నామని చిత్ర బృందం తెలిపింది.