కేంద్ర మంత్రి వర్గ విస్తరణ

SMTV Desk 2017-07-18 13:38:45  Union, Minister, expansion, of, the, Union

న్యూఢిల్లీ, జూలై 18 : ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్ర్రి నరేంద్ర మోదీ త్వరలో క్యాబినెట్ విస్తరణ చేపట్టనున్నారని తెలుస్తుంది. మనోహర్ పారికర్ గోవా సిఎం గా వెళ్ళడం, అనిల్ అకాల మరణానికి గురవ్వడం వలన కేంద్ర మంత్రి వర్గంలో రెండు పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి. రక్షణ, పర్యావరణ వంటి కీలక శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆ రెండు శాఖలను అదనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతో మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాక తప్పదని ప్రధాన మంత్రి మోదీ అంటున్నారు.